కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో వేల ఎకరాల పంట నష్టం: ఎమ్మెల్యే వివేక్

కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో వేల ఎకరాల పంట నష్టం: ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను, అన్నారం బ్యారేజీని సందర్శించారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాంట్రాక్టర్లను కోటీశ్వరులను చేసేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు ఎమ్మెల్యే. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. 

నాడు BRS చేసిన తప్పిదాల వల్లే వర్షాలకు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. బ్యాక్ వాటర్ తో నష్టపోతున్న రైతులకు అండగా ఉంటాన్నారు ఎమ్మెల్యే వివేక్.