చేవెళ్లకు రూ.10 కోట్ల నిధులు

చేవెళ్లకు రూ.10 కోట్ల నిధులు

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గానికి ఎస్సీ సబ్ ప్లాన్ సీఆర్‌‌ఆర్‌‌ ఫండ్స్ కింద రూ.10.40 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. తన క్యాంపు ఆఫీస్​లో గురువారం ఆయన మాట్లాడారు. ఈ నిధులతో చేవెళ్ల, శంకర్​పల్లి, షాబాద్, మొయినాబాద్, నవాబ్​పేట​మండలాలల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్‌‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు.

అలాగే చేవెళ్ల, మొయినాబాద్ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు రూ.1.60 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి,  చేవెళ్ల మార్కెట్​కమిటీ చైర్మన్​ పెంటయ్య గౌడ్​, వైస్​ చైర్మన్​ రాములు, పీఏసీఎస్​ చైర్మన్లు దేవర వెంకట్​రెడ్డి, ప్రతాప్​రెడ్డి, నక్క బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.