భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు స్పెషల్​ కోర్టులు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు స్పెషల్​ కోర్టులు
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్​ వసంత్​ 
  • కొత్త కోర్టుల బిల్డింగ్​ నిర్మాణాలకు భూమి పూజ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు కొత్తగా ఫ్యామిలీ కోర్టుతో పాటు ఎస్సీ, ఎస్టీ స్పెషల్​ కోర్టులు అదనంగా రానున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్​ వసంత్​ తెలిపారు. కొత్తగూడెంలోని జిల్లా కోర్టు ఆవరణలో అదనపు కోర్టు బిల్డింగ్​ల నిర్మాణాలకు బుధవారం ఆయన భూమి పూజ చేశారు.

ఈ ప్రోగ్రాంలో న్యాయమూర్తులు గొల్లపూడి భానుమతి, బత్తుల రామారావు, ఎ. సుచరిత, పి, సాయి, వి. శివనాయక్, బార్​అసోసియేషన్​ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, గవర్నమెంట్​ ప్లీడర్​ పలివెల గణేశ్​ బాబు, పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ పోసాని రాధాకృష్ణమూర్తి, అదనపు పబ్లిక్​ ప్రాసిక్యూటర్స్​ తదితరులు పాల్గొన్నారు.