గ్రూప్ వన్ అభ్యర్థులపై లాఠీచార్జ్ ఎఫెక్ట్.. చిక్కడపల్లి సీఐ బదిలీ

గ్రూప్ వన్ అభ్యర్థులపై లాఠీచార్జ్ ఎఫెక్ట్.. చిక్కడపల్లి సీఐ బదిలీ

ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లి సీఐ ఏరుకొండ సీతయ్యపై బదిలీ వేటు పడింది. శుక్రవారం ర్యాలీ నిర్వహిస్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడంతో ఆయనను స్పెషల్ బ్రాంచ్ కి బదిలీ చేస్తూ నగర సీపీ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా గతంలో ఓ చర్చి వివాదంలో ఆయన తలదూర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన స్థానంలో ఎస్బీ నుంచి రాజు నాయక్ ను చిక్కడపల్లి సీఐగా బదిలీ చేశారు.