
పాలకుర్తి, వెలుగు: ఆడుకుంటూ వెళ్లి నీళ్ల బకెట్లో పడి ఓ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జరిగింది. పాలకుర్తి అంగడి బజారులోని బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన కడకంచి రాములమ్మ, మల్లేశ్ దంపతుల కొడుకు దానియల్ (16 నెలలు) ఆదివారం ఇంట్లో ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు బయట తమ పనులు చేసుకుంటున్నారు. ఆడుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న బకెట్ నీళ్లలో దానియల్ తలకిందులుగా పడి ఊపిరాడక చనిపోయాడు.