కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు గురువారం ఆందోళన చేశారు. ఏనుమాముల మార్కెట్కు సుమారు 18వేల మిర్చి బస్తాలు రాగా మార్కెట్లోని వ్యాపారులు మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు ఆవేదన చెందారు.
క్వింటాల్కు రూ.1000, నుంచి రూ.500 వరకు ధర తగ్గించి వ్యాపారులు కొంటున్నారని అన్నారు. ఏంటని అడిగితే.. స్పందించడం లేదని చెప్పారు. మార్కెట్ కమిటీ ఆఫీసర్ల వచ్చి రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు.