
ఎన్నో భారీ నిర్మాణాలు, ఎత్తైనా కట్టడాల్లో చైనా ముందుంటుంది. లేటెస్ట్ గా ఓ లోయలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన నిర్మించి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది చైనా.
గుయ్ జౌ ప్రాంతంలో బీపన్ నదిపై రెండు మైళ్ల పొడువున హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ వంతెనను నిర్మించింది. ఈ బ్రిడ్జిని 2025 జూన్ లో ప్రారంభించబోతుంది చైనా. ఇది 2050 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా నిలవబోతుంది.
విశేషం ఏంటంటే...2022లో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించగా మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. ఈ బ్రిడ్జిని(280మిలియన్ పౌండ్లు) భారత కరెన్సీలో దాదాపు 2400 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఐఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తు, మూడు రెట్లు ఎక్కువ బరువుతో నిర్మించారు. అంతేగాకుండా ఈ బ్రిడ్జితో ఒక గంట పట్టే ప్రయాణాన్ని ఒక నిమిషంలోనే చేరుకోవచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎత్తైన లోయలో ఉన్నఈ బ్రిడ్జి అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ బ్రిడ్జి చైనాలోని గ్రామీణ ప్రాంతంలో రవాణా సౌకర్యంతో పాటు ఈ కొత్త వంతెన ప్రధాన టూరిజం స్పాట్ గా నిలుస్తోంది. ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనలలో దాదాపు సగం చైనాలోనే ఉండటం విశేషం.
China's Huajiang Grand Canyon Bridge is set to open this year, becoming the world's tallest bridge at 2050 feet high.
— Collin Rugg (@CollinRugg) April 8, 2025
Recent footage of the bridge has been released, showing crews putting on the finishing touches.
One of the most insane facts about the bridge is that… pic.twitter.com/DLWuEV2sXQ