
చైనాలో రోజుకొక కొత్త ఆచారం .. రోజుకొక వెరైటీ ఫుడ్.. ఆ టేస్టే వేరు.. అందుకే ప్రపంచవ్యాప్తంగా చైనా రెస్టారెంట్లు అంటే జనాలు పడి చస్తారు. వారు దేనితో తయారు చేస్తారో తెలియదు కాని ... లొట్టలేసుకొని తింటారు.. కాని ఈ వీడియోను చూస్తే.. ఇక ఈ జన్మలో.. కాదు.. కాదు ఏ జన్మలోనైనా చైనాఫుడ్ను బాయ్కాట్ చేస్తారు... ఇంతకూ ఆఫుడ్లో ఏముందంటే ..
చైనాలో పాపులర్ రెస్టారెంట్ అయిన హైదిలావ్లో పులుసులో మూత్రం ( యూరిన్) కలుపుతున్నారు.. కలపడం అంటే కలపడం కాదు.. చైనాలోని షాంఘై శివారు ప్రాంతంలోని హైదిలాస్ రెస్టారెంట్లో పులుసు ఉడుకుతుండగా ఇద్దరు పురుషులు మూత్ర విసర్జన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Just when you thought the world couldn’t get any crazier… someone stands up and pisses in the Haidilao hotpot. Blasphemy! Hotpot treason!
— Manya Koetse (@manyapan) March 6, 2025
Anyway, Haidilao reported the guy to the police, and I’m pretty sure he won’t be welcome back anytime soon. pic.twitter.com/3ytLhGdYjX
ఈ ఘటన ఫిబ్రవరి 24 వ తేదీన జరగ్గా.. మార్చి6 వ తేదీన ఘటన జరిగిన ప్రదేశాన్ని నిర్దారించారు. మొదట ఈ వివరాలను చెప్పేందుకు ఇబ్బంది పడిన హైదిలావ్ రెస్టారెంట్ యాజమాన్యం తరువాత ఇది కరక్టేనని ధృవీకరిస్తూ.. సిబ్బంది లోపం వలన జరిగిందని అంగీకరించింది.
Also Read : స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..?
పులుసులో మూత్రం కలవడం వలన హైదిలావ్ కస్టమర్లకు కలిగిన బాధను తాము తీర్చలేమని ..ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని ప్రకటించింది. 4 వేల మంది బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని హైదిలావ్ యాజమాన్యం తెలిపింది. అయితే ఎంత పరిహారం ఇస్తారో వెల్లడించలేదు. ఈఘటనపై జియాన్యాంగ్, సిచువాన్ లో రెస్టారెంట్ల మెయిన్ బ్రాంచ్ లు.. ఇంకా హైదిలావ్ రెస్టారెంట్లు ఉన్నచోట్ల పోలీసులు ఆరా తీస్తున్నారని UK మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ కేసులో షాంఘై పోలీసులు అనుమానిస్తున్న 17 ఏళ్ల ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కంపెనీ సివిల్ దావాను కోర్టులో దాఖలు చేసింది.
హైదిలావ్ రెస్టారెంట్ 1994 లో చైనాలోని సిచువాన్ అనే చిన్న గ్రామంలో స్థాపించారు. ఆ తరువాత చైనీస్ వంటకాలతో బ్రాండ్ గా మారడంతో 2023 జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 1400 రెస్టారెంట్లకు పైగా ప్రారంభించింది. చైనాలో హైదిలావ్ రెస్టారెంట్లు 1360 ఉన్నాయి. సింగపూర్, యుఎస్, కెనడా, యుకె , ఆస్ట్రేలియాతో సహా 14 దేశాలలో 122 హైదిలావ్ అవుట్లెట్లను నిర్వహిస్తోంది.