
కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో గురువారం రాత్రి యానివర్సరీ వేడుకలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను అలరించాయి. దేశ భక్తి, జానపద గేయాలు, విద్య వల్ల కలిగే ప్రయోజనాలపై నృత్య ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈవో ఎల్లయ్య, హెచ్ఎం హన్మండ్లు, టీచర్లు అరుణ్జ్యోతి, శోభారాణి, శ్యామల, లావణ్య, శృతి, భార్గవి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.