గాయత్రి మరణ వార్త విని చాలా బాధపడ్డా: చిరంజీవి

గాయత్రి మరణ వార్త విని చాలా బాధపడ్డా: చిరంజీవి

హైదరాబాద్: సినీ పరిశ్రమలో అందరికీ ఆనందాన్ని పంచే రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరణమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో ఇవాళ (అక్టోబర్ 5, 2024) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూకట్ పల్లి ఇందు విల్లాస్‎లోని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి గాయత్రి భౌతికాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మరణవార్త వినడం బాధకరమన్నారు.

Also Read :- రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన అల్లు అర్జున్

46 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో తనతో కలిసి పని చేస్తున్న రాజేంద్రప్రసాద్ పిల్లలు, మా పిల్లలతో సమాన వయసులో ఉండే వారిని.. అలాంటి కుటుంబంలో విషాద వార్త వినడం బాధాకరణమని ఆవేదన వ్యక్తం చేశారు. 2024, అక్టోబర్ 5వ తేదీ తెల్లవారుజూమున గాయత్రి మరణ వార్త విని బాధపడ్డామని.. ఎప్పుడు షూటింగ్‎లలో నవ్వుతూ ఉండే రాజేంద్రప్రసాద్ తన కూతురు లేకుండా ఎలా తట్టుకుంటారో లేదోనని బాధపడ్డామన్నారు. రాజేంద్ర ప్రసాద్ మనోధైర్యంతో ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.