జపాన్ టూర్​కు నవోదయ విద్యార్థి

జపాన్ టూర్​కు నవోదయ విద్యార్థి

చొప్పదండి, వెలుగు : చొప్పదండి నవోదయ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్న పి.రిత్విక్​రెడ్డి జపాన్ లో జరిగే సకురా సైన్స్ ప్రాజెక్ట్​కు ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ ​పి.మంగతాయారు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఇంటర్ సెకండియర్​చదువుతున్న 660 స్టూడెంట్ల నుంచి 20 మంది మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగ్గా

అందులో కరీంనగర్ జిల్లా చొప్పదండి నవోదయ విద్యాలయ విద్యార్థి రిత్విక్ ఎంపికైనట్లు చెప్పారు. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు జపాన్​లో వివిద విద్యాలయాలు, యూనివర్సిటీలు, సైన్స్ పరిశోధనా కేంద్రాలను సందర్శించి ప్రొఫెసర్లు, విద్యార్థులతో ముఖాముఖి చర్చల్లో పాల్గొంటాడని  తెలిపారు.