చంచల్ గూడ జైలుకి కొరియోగ్రాఫర్ జానీ.

చంచల్ గూడ జైలుకి కొరియోగ్రాఫర్ జానీ.

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని లైంగికంగా వేధించిన కేసులో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అనంతరం జానీ ని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండులో ఉంచి విచారించారు. 

కాగా నేటితో జానీ రిమాండు గడువు ముగియడంతో పోలీసులు రంగారెడ్డి జిల్లాలో కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో విచారణలో రికార్డ్ చేసిన ఆధారాలు పోలీసులు కోర్టుకి సమర్పించారు. దీంతో అధరాలు పరిశిలించిన కోర్టు అక్టోబర్ 3వ తారీఖు వరకూ కొరియోగ్రాఫర్ జానీ కస్టడీ ని పొడిగించింది. దీంతో పోలీసులు జానీ ని చంచల్ గూడ జైలుకి తరలించారు. 

ఈ విషయం ఇలా ఉండగా కొరియోగ్రాఫర్ జానీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. కాగా ఇటీవలే జానీ భార్య అయేషా తన భర్త ఎటువంటి పాపం ఎరుగడని అలాగే అసిస్టెంట్ కొరియగ్రాఫర్ తాం భర్తని ప్రేమ పెళ్లి వేధింపులకు గురి చేసిందని రివర్స్ లో ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.