ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పరారీలో ఉన్న సీఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సీఐడీ. మరో ఏ6 నిందితుడు శ్రవణ్ రావుకు కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును విచారిస్తే..

మరిన్ని విషయాలు బయటకొచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి. అనారోగ్యం కారణంగా తాను ఇండియాకు రాలేకపోతున్నానని ఇప్పటికే ప్రభాకర్ రావు వీడియోసందేశం విడుదల చేశారు. ఇటు శ్రవణ్ రావు ఆచూకీ లేదంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.