తెలంగాణ ఎంఎస్​ఎంఈ సమ్మిట్ నిర్వహించిన సీఐఐ

తెలంగాణ ఎంఎస్​ఎంఈ సమ్మిట్ నిర్వహించిన సీఐఐ

హైదరాబాద్​, వెలుగు : సీఐఐ తెలంగాణ ఎంఎస్​ఎంఈ సమ్మిట్ 2024 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం జరిగింది.  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈలను సాధికారం చేయడం, వాటి ముఖ్య సవాళ్లను పరిష్కరించడం,  అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా సదస్సును నిర్వహించామని సీఐఐ తెలిపింది. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లు, మార్కెట్ విస్తరణ వంటి అంశాలపై చర్చ జరిగిందని పేర్కొంది. 

ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్​రంజన్​ మాట్లాడుతూ మెరుగైన సాంకేతికతలపై పెట్టుబడి ఎంఎస్​ఎంఈల వృద్ధికి బలమైన పునాది వేస్తుందని చెప్పారు.   ఎంఎస్​ఎంఈలు క్రెడిట్ యాక్సెస్, టెక్నాలజీ యాక్సెస్,  మొదలైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వీటి అధిగమించడానికి క్రమబద్ధమైన విధానం అవసరమన్నారు.