తిరుమల లడ్డూ వ్యవహరంపై సిట్ దర్యాప్తు వేగవంతం

తిరుమల లడ్డూ వ్యవహరంపై సిట్ దర్యాప్తు వేగవంతం

తిరుమల లడ్డూ వ్యవహరంపై దర్యాప్తునువేగవంతం చేసింది సిట్ బృందం. సిట్ ఛీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బృందం మూడు బృందాలుగా ఏర్పడి తిరుమల, తిరుపతిలో ఏకకాలంలో దర్యాప్తు చేపట్టింది.  గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకటరావుల నేతృత్వంలో మూడు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.  

టీటీడీ  ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోనుంది సిట్ బృందం. పాలకమండలి దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలను సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.