
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మండిపడ్డారు. పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు.
కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.