
జడ్చర్ల, వెలుగు: పోలేపల్లి సెజ్లో ఎవర్ ట్రోజన్ కంపెనీలో డ్యూటీ చేసి బైక్పై ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయిన పసుపుల చంద్రశేఖర్ ఫ్యామిలీకి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి సీఐటీయూ నాయకులు కంపెనీ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మృతుడి భార్యకు కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య, బాగి కృష్ణ య్య పాల్గొన్నారు. యాక్సిడెంట్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుసీఐ ఆదిరెడ్డి తెలిపారు.