మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు ఇవ్వాలి

మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు ఇవ్వాలి

మధిర, వెలుగు : మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను, బిల్లులు వెంటనే చెల్లించాలని మధిర ఎంపీడీవో ఆఫీస్​ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా సీఐటీయూ  రాష్ట్ర కమిటీ సభ్యుడు  శీలం నరసింహారావు మాట్లాడారు.  మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలల నుంచి  వేతనాలు చెల్లించడం లేదని, పెంచిన రూ.3 వేల జీతం కూడా ఇవ్వడం లేదని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని, వంట సామగ్రి ఇవ్వాలని,  వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో  మండవ ఫణీంద్ర కుమారి, పడకంటి మురళి, రామ నరసయ్య, మంద సైదులు, మద్దాల ప్రభాకర్, తేలబ్రోలు రాధాకృష్ణ, మధు, విల్సన్, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.