లేబర్​ కోడ్​లను రద్దు చేయాలి : పాలడుగు భాస్కర్

లేబర్​ కోడ్​లను రద్దు చేయాలి : పాలడుగు భాస్కర్
  • సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన లేబర్​కోడ్​లను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్​ డే నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్​ తెలిపారు. కొత్తగూడెంలోని సీఐటీయూ జిల్లా ఆఫీస్​లో సోమవారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసేందుకే లేబర్​ కోడ్​లను తీసుకువచ్చిందన్నారు.

2022 సెప్టెంబర్​ 23న లేబర్​ కోడ్​ల బిల్లును బీజేపీ సర్కార్​ ప్రవేశపెట్టిందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రోగ్రాంలో సీఐటీయూ నేతలు హదు, బ్రహ్మచారి, వెంకటేశ్, రమేశ్, పద్మ, అప్పారావు, అర్జున్​పాల్గొన్నారు.