
- ఇప్పటి వరకు మిల్లర్లు ఇచ్చింది 69.41 శాతమే..
- మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటున్న ఆఫీసర్లు
మెదక్, వెలుగు: కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఇవ్వడంలో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ధాన్యం తీసుకుంటున్నా టార్గెట్ మేరకు సీఎంఆర్ ఇవ్వడం లేదు. దీంతో సివిల్సప్లై అధికారులు సంబంధిత మిల్లర్ల నుంచి సీఎంఆర్సేకరించడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ మేరకు మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటున్నారు. మెదక్ జిల్లాలో 2023 – -24 వానాకాలం, యాసంగి, 2024–-25 వానాకాలం సీజన్ లో రైస్ మిల్లులకు 7,88,743 టన్నుల ధాన్యం సరఫరా చేశారు.
రైస్ మిల్లర్లు 5,31,053 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు బాయిల్డ్ రైస్ 1,52,920 టన్నులు, రా రైస్1,60,140 టన్నులు, సన్నాలు ఎస్పీఆర్ 14, 111 టన్నులు, సెంట్రల్ 41,281 టన్నులు కలిసి మొత్తం 3,68,624 టన్నుల (69.41 శాతం) సీఎంఆర్ మాత్రమే ఇచ్చారు. ఇంకా 1,62,424 టన్నులు బ్యాలెన్స్ఉంది. సీజన్ల వారీగా 2023 –-24 వానాకాలం సీజన్కు సంబంధించి 1,79,709 మెట్రిక్ టన్నులు ( 99.43 శాతం), 2023-–24 యాసంగి సీజన్కు సంబంధించి 1,45,022 టన్నులు (84.91శాతం), 2024 –-25 వానాకాలానికి సంబంధించి 43,891 టన్నులు (24.45 శాతం) సీఎంఆర్ సరఫరా జరిగింది.
ప్రస్తుతం జిల్లాలోని రైస్ మిల్లుల్లో 2,42,432 మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉంది. 2024 –-25 వానాకాలం సీజన్ కు సంబంధించి 94 రైస్మిల్లులు, 2023 –-24 యాసంగి సీజన్కు సంబంధించి 38 రైస్ మిల్లులు, వానాకాలం 2023 –-24 సీజన్కు సంబంధించి 4 రైస్ మిల్లులు సీఎంఆర్ బకాయి ఉన్నాయి. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులు సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్ల నుంచి గడువులోగా సీఎంఆర్ సేకరించేలా బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటున్నారు. 2024 –- 25 వానాకాలం సీజన్కు సంబంధించి 13 మంది రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేశారు. ఇవి పోను ఇంకా 81 మంది మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేయాల్సి ఉంది.
అడిషనల్ కలెక్టర్ రివ్యూ
బ్యాంక్ గ్యారంటీలు, సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయడంలో రైస్ మిల్లర్స్, బ్యాంకర్స్ వేగం పెంచాలని అడిషనల్ కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. ఇటీవల ఆయన కలెక్టరేట్ సీఎంఆర్ లక్ష్యాలపై బ్యాంకర్స్, రైస్ మిల్లర్స్ తో సమీక్ష నిర్వహించారు. గడువు లోపు సీఎంఆర్ పూర్తి చేయాలని మిల్లర్లకు సూచించారు. బ్యాంక్ గ్యారంటీలు అందజేయడంలో బ్యాంకర్లు వేగం పెంచాలని చెప్పారు.