![చొప్పదండి మండలంలో రైస్మిల్లుల్లో తనిఖీలు](https://static.v6velugu.com/uploads/2024/07/civil-supply-task-force-team-officers-inspected-rice-mills-in-choppadandi-mandal_01zq6cTFCE.jpg)
చొప్పదండి, వెలుగు: చొప్పదండి మండలంలోని వరలక్ష్మి, విరాజాక్షి రైస్ మిల్లులను సివిల్ సప్లై టాస్క్ఫోర్స్ టీం ఆఫీసర్లు మంగళవారం తనిఖీ చేశారు. సివిల్ సప్లై టాస్క్ఫోర్స్ స్టేట్ మెంబర్ ప్రభాకర్, జగిత్యాల డీసీవో వెంకటేశ్వరరావు, డీటీసీఎస్ సురేందర్ ఆధ్వర్యంలో మిల్లులకు కేటాయించిన నిల్వలను పరిశీలించారు.
నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించామని ఆఫీసర్లు తెలిపారు. వారి వెంట తహసీల్దార్ నరేందర్, ఎస్సై ఉపేంద్రాచారి, ఉన్నారు.