శ్రీవారి సేవలో సీజేఐ డివై.చంద్రచూడ్

శ్రీవారి సేవలో సీజేఐ డివై.చంద్రచూడ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ సెప్టెంబర్​ 29 ఆదివారం ఉదయం  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని, శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డివై.చంద్రచూడ్ కు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ  ఈవో శ్రీ శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు.

 స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు.   అనంతరం టీటీడీ ఈవో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో  సివిఎస్వో శ్రీ శ్రీధర్, డెప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

అంతకుముందు అనగా శనివారం ( సెప్టెంబర్​ 28) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డివై చంద్రచూడ్​ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని  దర్శించుకున్నారు. గర్భగుడిలో సీజేఐ దంపతులు పద్మావతి అమ్మవారికి ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు బాబు స్వామి, మణికంఠ స్వామి స్థల పురాణం గురించి సీజేఐకి వివరించారు. అమ్మవారి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్‌ దంపతులకు వేద‌ పండితులు వేదశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు