భాగ్యనగరంలో వినాయకచవితి సందడి.. మట్టి విగ్రహాలకే పూజలు చేయండి..

భాగ్యనగరంలో వినాయకచవితి సందడి.. మట్టి విగ్రహాలకే పూజలు చేయండి..

వినాయకచవితి సమీపిస్తుండటంతో నగరంలో వినాయక ప్రతిమలు విభిన్న రూపాల్లో అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. కొన్ని చోట్ల విగ్రహాల విక్రయాలూ జోరందుకున్నాయి. మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాలకు సంభందించి వివిధ శాఖలతో సమావేశం నిర్వహించారు. పోలీస్, ఫైర్, హెల్త్, జీహెచ్ఎంసీకి సంబందించిన సిబ్బంది పాల్గొన్నారు. 

భాగ్యనగరంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలను ఎంతో వైభవంగా.. భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.  వివిధ ఉత్సవ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు ఈ సమావేశం లో పాల్గొన్నారని తెలిపారు. వారు గతంలో ఎదుర్కొన్న  చిన్న చిన్న ఇబ్బందులను మా దృష్టికి తెచ్చారన్నారు. వాటిని పునరావృతం కాకుండా చూడాలని అధికారులను అదేశించామన్నారు. 

ముఖ్యంగా ట్రాఫిక్, కరెంట్ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అందరినీ కలుపుకొని ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించామని మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. అందరు కూడా సహకరించి ముందుకు వెళతామని వారు తెలియజేశారన్నారు.

ALSO READ | మంగళ్ హాట్ ఠాణాలో గణేశ్ విగ్రహాల ధ్వంసం

 పొల్యూషన్ నీ దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాలు పెట్టేలా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. అందరికీ మట్టి విగ్రహాలు అందుబాటులో ఉండేలా చూడాలని అదేశించారు. మట్టి విగ్రహాల ఉపయోగంపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తామన్నారు. మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ప్రజలని విజ్ఞప్తి చేశారు.