హైదరాబాద్ సిటీలో నల్లాల్లో నలకలు లేని నీళ్లు.. GHMC సమ్మర్ యాక్షన్ ప్లాన్

హైదరాబాద్ సిటీలో నల్లాల్లో నలకలు లేని నీళ్లు.. GHMC సమ్మర్ యాక్షన్ ప్లాన్

హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేసి జీరో బ్యాక్టీరియల్​రిజర్వాయర్లుగా మార్చబోతున్నారు. నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా అధికారులు ప్రతి రోజూ క్లోరినేట్​చేసిన నీటినే సరఫరా చేస్తున్నారు. అయితే, రోజుల తరబడి నిల్వ ఉండే రిజర్వాయర్లను కూడా క్లీన్గా ఉంచడమే లక్ష్యంగా దశల వారీగా ఈ పనులు చేయబోతున్నట్టు అధికారులు తెలిపారు.

జర్మన్​ టెక్నాలజీతో ట్యాంకుల క్లీనింగ్​

ప్రస్తుతం కేపీహెచ్​బీ ఫేజ్–4, 6 పరిధుల్లోని 5.0 మిలియన్​ లీటర్స్ రిజర్వాయర్, బోరబండలోని 5.0 ఎంఎల్, గాయత్రి నగర్​(5.60 ఎంఎల్​), ఎల్లమ్మబండ (5.0 ఎంఎల్​, 0,60 ఎంఎల్​), చింతల్​( 4.48 ఎంల్​) రిజరాయర్లను క్లీన్​ చేయాలని నిర్ణయించారు. ముందుగా వీటిని ఖాళీ చేసి పనులు మొదలుపెడతారు. ఈ క్లీనింగ్​పనుల కోసం జర్మనీ స్టేట్ ఆర్ట్​ టెక్నాలజీ ఉపయోగించబోతున్నారు.

హైస్పీడ్​ప్రెషర్​రోటరీ జెట్​ క్లీనింగ్, యాంటీ బ్యాక్టీరియల్​ సిస్టమ్ ​ద్వారా క్లీన్​ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ట్యాంకుల్లో ఉండే సెడిమెంట్, నాచుతో పాటు హానికరమైన బ్యాక్టీరియా కూడా తొలగిపోతోందంటున్నారు. తక్కువ నీళ్లను వాడుకుని, అతి తక్కువ టైంలో శుభ్రం చేయవచ్చంటున్నారు.

ఈ క్లీనింగ్​ప్రాసెస్ను టీ క్లీనింగ్​ప్రాసెస్​ అంటారని, మోటార్కు ఉండే హై ప్రెషర్​రోటరీ జెట్కు ఉన్న నాజిల్తో నీటిని ఫ్రెషర్తో రిలీజ్ చేస్తుందని, దీంతో ట్యాంకుల్లో పేరుకున్న మట్టి, నాచు, బ్యాక్టీయాను, ట్యాంక్ ​గోడలకు పేరుకుపోయిన మురికి చాలా సులభంగా క్లీన్​ అవుతుందంటున్నారు. 

Also Read:-భూదాన్ భూముల ఇష్యూ.. ఓల్డ్ సిటీలో ఈడీ తనిఖీలు

ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్​ఎక్విప్​మెంట్​నీటిలో ఉండే కాలుష్యాన్ని సులభంగా తొలగిస్తుందని అంటున్నారు. ఈ వేసవిలోనే ట్యాంకులను క్లీన్​చేసి వచ్చే నెల నుంచి మరింత స్వచ్ఛమైన నీటిని అందిస్తామని చెప్తున్నారు. రోజువారీ నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా దశల వారీగా ట్యాంకుల క్లీనింగ్​ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.