సీఎల్పీ మీటింగ్.. పీసీసీ చీఫ్కు సన్మానం

సీఎల్పీ మీటింగ్.. పీసీసీ చీఫ్కు సన్మానం

 సీఎం  రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. మాదాపూర్ లో జరుగుతోన్న  ఈ సమావేశానికి పీసీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఇంచార్జ్ దీపాదాస్ మున్షితోపాటు..మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను సన్మానించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానికసంస్థల ఎన్నికలు, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ మెజారిటీసీట్లుసాధించేలా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.

 ఈ సమావేశానికి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీ, దానం నాగేందర్,కడియం శ్రీహరి హాజరయ్యారు.