నరాలు తెగే ఉత్కంఠ పోరులో సీఎం అతిశీ ఘన విజయం

నరాలు తెగే ఉత్కంఠ పోరులో సీఎం అతిశీ ఘన విజయం

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కౌంటింగ్‎లో చివరి వరకు వెనుకంజలో ఉన్న ఢిల్లీ సీఎం అతిశీ.. అనూహ్యంగా లాస్ట్ రౌండ్‎లో పుంజుకుని విజయం సాధించింది. కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అతిశీ.. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై గెలుపొందింది. కల్కాజీ ఎన్నిక ఫలితం చాలా ఇంట్రెస్టింగ్‎గా సాగింది. తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి పూర్తి అధిపత్యం కనబరుస్తూ వచ్చారు. మధ్యలో ఎప్పుడో ఒకసారి సీఎం అతిశీ స్వల్ప అధిక్యం దక్కించుకున్నారు తప్పితే.. రమేష్ బిధూరినే లీడ్‎లో కొనసాగారు. 

Also Read :- ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్

దీంతో కల్కాజీలో సీఎం అతిశీ ఓటమి ఖాయం అనుకున్నారు అంతా. కానీ.. చివరి రౌండ్లలో అనూహ్యంగా పుంజుకున్న అతిశీ.. బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి ఆప్ అగ్రనేతలు ఎన్నికల్లో ఓటమి పాలవగా.. అతిశీ అనూహ్య విజయం సాధించారు. ఇక, 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. దేశ రాజధానిలో బీజేపీ విజయఢంకా మోగించింది. ఆప్ వరుస విజయాలకు బ్రేకులు వేసిన కాషాయ పార్టీ.. హస్తినా పీఠం దక్కించుకుంది.