ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భయంకరమైన చట్టం.. సీఎం చంద్రబాబు..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భయంకరమైన చట్టం.. సీఎం చంద్రబాబు..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  రద్దు బిల్లుపై అసెంబ్లీలో ప్రసంగించిన చంద్రబాబు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.ఇచ్చిన మాట  ప్రకారం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తున్నామని, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్ అనేది భయంకరమైన చట్టమని అన్నారు.ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి లాక్కునే పరిస్థితి వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం ఆలోచన లేకుండా ఈ చట్టాన్ని తెచ్చిందని అన్నారు. భూ సమగ్ర సర్వేపై వివాదాలున్నాయని, అందుకే హోల్డ్ చేశామని వివరించారు చంద్రబాబు.

Also Read:-ఏపీలో రెడ్ బుక్ కిరాతక పాలన చూడండీ : ఢిల్లీలో జగన్ ఎగ్జిబిషన్

భూమి పాస్ పుస్తకాలపై అప్పట్లో సీఎం బొమ్మ వేసి ఇచ్చారని, ఆ పాస్ పుస్తకాలు మార్చి రాజముద్ర వేసి ఇస్తామని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల పౌరుల భూమి లాక్కునే పరిస్థితి వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల ఎవ్వరైనా ఈ భూమి నాది అంటే, అది ట్రిబ్యునల్ కి వెళ్తుందని,అలా ప్రైవేట్ భూములను లాక్కునే అవకాశం ఉందని అన్నారు చంద్రబాబు.

ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి 512జీవోను రహస్యంగా ఉంచారని, తాము అధికారంలోకి వస్తే ఈ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని అన్నారు చంద్రబాబు. ఈ నల్ల చట్టం ద్వారా విదేశాల్లో ఉండేవారి భూమికి ప్రమాదం ఉందని, సభ్యులంతా కలిసి ఈ నల్ల చట్టానికి మంగళం పడాలని కోరుతున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. బుధవారం ( జూలై 24, 2024 ) నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.