
తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు.
నవంబర్ 9వ తేదీ ఉదయం సిద్దిపేట జిల్లా కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్ లో కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.