
బీఆర్ఎస్ పార్టీ అమ్ములపొదిలో ఇంకా చాలా ఎన్నికల హామీల అస్ర్తాలున్నాయని సీఎం కేసీఆర్అన్నారు. అసెంబ్లీలో రాష్ట్రాభివృద్ధిపై జరిగిన దీర్ఘకాలిక చర్చపై సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలపై సీఎం విరుచుకుపడ్డారు.
కర్ణాటక ఎన్నికల్లో అలవికాని హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతోందని సీఎం అన్నారు. హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ఖజానా సరిపోక.. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్నిధుల్ని మళ్లించి కన్నడనాట హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందని తెలిపారు.
అలాంటి హామీలనే ఇక్కడా ఇద్దామని కాంగ్రెస్ చూస్తోందని అందులో భాగంగా పింఛన్లు రూ.4 వేలకు పెంచినట్లు ఖమ్మం సభలో ప్రకటించారని చెప్పారు. 2018లో రూ.2 లక్షల రుణమాఫీ అన్నప్పుడే కాంగ్రెస్ని ప్రజలు విశ్వసించలేదని పేర్కొన్నారు.