రేపు శంకర్​పల్లికి సీఎం కేసీఆర్​

రేపు శంకర్​పల్లికి సీఎం కేసీఆర్​
  • కొండకల్ రైల్వే కోచ్ ​ఫ్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

శంకర్​పల్లి,  వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం కొండకల్​ గ్రామంలో రూ. 800కోట్లతో  మేధా సంస్థ ఏర్పాటు చేసిన రైల్వే కోచ్​ ఫ్యాక్టరీని గురువారం సీఎం కేసీఆర్​ ప్రారంభించనున్నారు.

ఈ క్రమంలో మంగళవారం రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు హరీశ్, శరత్, సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్ర సీఎం పర్యటించనున్న ప్రదేశాలను పరిశీలించారు.  కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు వారు సూచించారు.