
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో ఉన్న కేసీఆర్చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత హైదరాబాద్కు వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని నందినగర్లో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో ఓటు వేయనున్నారు.