
పిట్లం, వెలుగు: సీఎం సహయనిధి చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అందజేశారు. సోమవారం మద్నూర్ మార్కెట్ కమిటీ, జుక్కల్ క్యాంపు కార్యాలయంలో బాధితులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్సచేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి సీఎం సహయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మద్నూర్ నుంచి శబరిమలకు వెళ్తున్న స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సౌజన్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.