కేసీఆర్ను రమ్మనండి.. ఢిల్లీలో ధర్నా చేద్దాం : సీఎం రేవంత్ సవాల్

కేసీఆర్ను రమ్మనండి.. ఢిల్లీలో ధర్నా చేద్దాం : సీఎం రేవంత్ సవాల్

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరగటం..నిధులు విడుదల చేయకపోవటంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ నడిచింది. ఢిల్లీలో పోరాటం చేస్తారా అంటూ కేటీఆర్ సవాల్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ను రమ్మనండి.. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం.. కేసీఆర్ తో కలిసి ధర్నా చేయటానికి సిద్ధం అంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేశారు.  కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందర్నీ ఢిల్లీ తీసుకెళతామన్నారు. 

చావు నోట్లో తల పెట్టామని మేం ఎప్పుడూ చెప్పలేదు..మేం 100 రూపాయల పెట్రోల్ కొని.. పది పైసల అగ్గిపెట్టె కొనకుండా ఉండలే.. శ్రీకాంతాచారి బలిదానానికి హరీశ్ రావునే కారణం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీక్షలో కూర్చొని 24 గంటలు కాకముందే నిమ్మరసం తాగలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

ALSO READ | Telangana Assembly: సీఎం రేవంత్పై కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి శ్రీధర్ బాబు