దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్కు శంకుస్థాపన

దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్కు శంకుస్థాపన

వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) నేవీ రాడర్  స్టేషన్  కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా  సీఎం రేవంత్​రెడ్డి హాజరయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, కేంద్రమంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. 

నేవీ రాడార్ కు సంబంధించి దేశంలోనే  ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. 2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ లు వచ్చినప్పటికీ.. గత ప్రభుత్వం భూముల కేటాయించలేదు.

ఈ ఏడాది జనవరిలో   కమోడోర్  కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో  రోహిత్ భూపతి, కెప్టెన్  సందీప్ దాస్  సీఎం  రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం వికారాబాద్ డీఎఫ్ వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.