అధైర్యపడొద్దు.. అండగా ఉంటా : కార్యకర్త కుటుంబానికి సీఎం రేవంత్​ భరోసా

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా : కార్యకర్త కుటుంబానికి సీఎం రేవంత్​ భరోసా

కొడంగల్, వెలుగు: వికారాబాద్​ జిల్లా రేగడి మైల్వార్​కు చెందిన కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ కార్యకర్త నర్సిరెడ్డి ఇటీవల ఆనారోగ్యంతో మృతిచెందగా.. శనివారం సీఎం రేవంత్​రెడ్డి నర్సిరెడ్డి ఇంటికి వెళ్లి అయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటానని అధైర్య పడొద్దని నర్సిరెడ్డి భార్య యాదమ్మకు భరోసా ఇచ్చారు. సీఎం వెంట ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రాంమోహన్​రెడ్డి, మనోహర్​రెడ్డి తదితరులు ఉన్నారు.