
ప్రముఖ చిత్రకారుడు ఎ.నరేందర్ ‘ది ఎటర్నల్మెస్మరైజర్’ పేరిట మాదాపూర్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సోమవారం సోలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రారంభించారు.
ఎమ్మెల్యేలు డా.రాజేశ్రెడ్డి, మధుసూదన్రెడ్డితో కలిసి ఎగ్జిబిషన్ మొత్తం కలియతిరిగారు. నరేందర్ గీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని.. ఆధ్మాత్మికతకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయని రేవంత్రెడ్డి ప్రశంసించారు. పెయింటింగ్ ఎగ్జిబిషన్ వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
– వెలుగు, మాదాపూర్