ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పర్యటన
- ఉదయం 10:15 గంటలకు అసెంబ్లీ నుంచి బస్సుల్లో ప్రయాణం
- అన్ని పార్టీలకు సర్కార్ ఆహ్వానం.. హాజరుకావడం లేదన్న బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం 10:15 గంటలకు ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ నుంచి బయల్దేరుతారు. భువనగిరి, జనగామ, హనుమకొండ మీదుగా జయశంకర్భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలోని మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మేడిగడ్డలో దెబ్బతిన్న ఏడో బ్లాక్లోని పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలిస్తారు.
అక్కడే ఇరిగేషన్అధికారులు, ఇంజనీర్లతో రివ్యూ చేస్తారు. ఇంజనీర్లు బ్యారేజీ కుంగుబాటుపై ప్రజంటేషన్ఇస్తారు. ఆ తర్వాత సీఎం, మంత్రులు మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరిగి హైదరాబాద్కు బయల్దేరుతారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రావాలని ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్ని పార్టీల ఫ్లోర్లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖ రాశారు. ఈ పర్యటనకు రావాలని కేసీఆర్ను ఆహ్వానించారు. కాగా, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ పార్టీ మంగళవారం ‘చలో నల్గొండ’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవరూ మేడిగడ్డ పర్యటనకు వెళ్లడం లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు.