
నారాయణపేట/ఆమనగల్లు/మరికల్/వంగూర్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడాన్ని స్వాగతిస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. నారాయణపేటలో సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంతో పాటు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లులో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. మరికల్లో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం చౌరస్తాలో సోనియాగాంధి, రాహుల్గాంధి, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.