పీఆర్ఓ బిడ్డ పెండ్లిలో సీఎం ఫ్యామిలీ

పీఆర్ఓ బిడ్డ పెండ్లిలో సీఎం ఫ్యామిలీ

వెలుగు, ఇబ్రహీంపట్నం: తన పీఆర్ఓ బిడ్డ పెండ్లికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. గురువారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని ఓ ఫంక్షన్ ​హాల్​లో సీఎం పీఆర్ఓ పురుషోత్తంరెడ్డి కుమార్తె వివాహం జరిగింది. రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి, కుమార్తె నైమిషారెడ్డి, అల్లుడు సత్యనారాయణరెడ్డితో కలిసి హాజరయ్యారు. 

వధూవరులను ఆశీర్వదించారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి, ఎమ్మెల్యేలు మల్​రెడ్డి రంగారెడ్డి, మనోహర్​రెడ్డి, రోడ్డు డెవలప్​మెంట్​కార్పొరేషన్​చైర్మన్​మల్ రెడ్డి రాంరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్​ కమిటీ చైర్మన్ ​చిలుకా మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.