ఆనాడు సోయి లేదా?..హారీశ్ కు సీఎం రేవంత్ కౌంటర్

ఆనాడు సోయి లేదా?..హారీశ్ కు సీఎం రేవంత్ కౌంటర్

అసెంబ్లీలో  ఆర్టీసీ అంశంపై హాట్ హాట్ గా డిస్కషన్  జరిగింది. కార్మికుల యూనియన్  పునరుద్ధరణ, పీఆర్సీ బకాయిలు, ఆర్టీసీలో ఖాళీలపై  మాజీ మంత్రి హరీశ్  రావు ప్రశ్నించారు.  అయితే సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పారు.  దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కల్గజేసుకుని... కార్మికుల పట్ల పోరాడే  కమ్యూనిస్టులకు మైక్ ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు.సాంబశివరావుకు  మైక్ ఇస్తే తప్పేంటన్నారు.ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 

ఆర్టీసీ కార్మికులు 50 రోజులు  సమ్మె చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలకు  సోయి లేదా? అని ప్రశ్నించారు సీఎం రేవంత్.  ఎన్నికల ముందు ఆదరబాదరగా ప్రభుత్వంలో విలీనం చేశారని మండిపడ్డారు. హరీశ్ రావు 2014 నుంచి మంత్రిగా పనిచేశారని తెలిపారు.  స్పీకర్ మీద నిందలు వేయం తగదన్నారు.  కార్మిక సంఘాలను రద్దు చేసిందే బీఆర్ఎస్ అని చెప్పారు. హరీశ్ రావు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.  కార్మిక  సంఘాలు దీక్షలు చేసినప్పుడు బీఆర్ఎస్ వివక్ష చూపిందన్నారు. ఆనాడు ఆర్టీసీ గౌరవ అద్యక్షుడు హరీశ్ రావేనని చెప్పారు.