ఢిల్లీకి సీఎం రేవంత్..ఎందుకంటే.?

ఢిల్లీకి సీఎం రేవంత్..ఎందుకంటే.?

ఇవాళ (సెప్టెంబర్ 30) రాత్రి 8 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి . బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.  సెప్టెంబర్ 29న  జమ్మూకశ్మీర్ కథువా సభలో అస్వస్థతకు గురైన AICC అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించనున్నారు.

 ఆ తర్వాత అధిష్టానం పెద్దలతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. తాజా రాజకీయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరించనున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులపై కూడా చర్చించే అవకాశం ఉంది.

 మోదీని గద్దె దించే వరకు చావను

కథువా బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగా.. ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడబోయారు. పక్కనే ఉన్న నేతలు ఖర్గేను కిందపడకుండా పట్టుకున్నారు. కాస్తన్ని నీళ్లు తాగిన ఖర్గే.. మళ్లీ ప్రసంగం కొనసాగించారు. ఆయన అస్వస్థతకు గురికాక ముందే తనకు ఎనబై మూడేళ్లు అయినప్పటికీ.. ఫిట్ గా ఉన్నాని అన్నారు. మోదీ సర్కార్ ను గద్దె దించే వరకు బతికే ఉంటానన్నారు ఖర్గే. జమ్ము కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా వచ్చే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన అన్నారు.