రాష్ట్ర ఆదాయం 18 వేల కోట్లు.. ఖర్చులు 22 వేల కోట్లు : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఆదాయం 18 వేల కోట్లు.. ఖర్చులు 22 వేల కోట్లు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతినెలా రూ.18 వేల కోట్లుగా ఉందని.. ఖర్చులు మాత్రం 22 వేల కోట్లుగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంధ్రభారతిలో కొలువుల పండుగలో భాగంగా జూనియర్ లెక్చరర్లకు నియామకపు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం ఆదాయం, అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read:-25 ఏళ్లకు ఉద్యోగం చేయాల్సినోళ్లు.. 35 ఏళ్లకు చేరారు

  • ప్రతినెలా తెలంగాణ ఆదాయం 18 వేల కోట్లు ఉంది.
  •  ప్రతి నెలా ఖర్చులు మాత్రం 22 వేల కోట్ల వరకు ఉంటున్నాయి.
  •  జీత భత్యాలకు 6 వేల 500 కోట్లు ఖర్చవుతుంది.
  • రాష్ట్ర అప్పులకు మరో 6 వేల 500 కోట్లు ఖర్చవుతున్నాయి.
  • మిగిలిన 5 వేల కోట్ల రూపాయలతోనే ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది..
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి కొన్ని పథకాలకు ప్రాముఖ్యత తగ్గించాల్సి వచ్చింది
  • ఏం చేయట్లేదని , దిగిపోమని బీఆర్ఎస్ అంటోంది.
  • ఐదేండ్లు సీఎంగా ఉండాలని ఎన్నుకుంది మీరే కదా
  • దిగిపో దిగిపో అని బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది
  • లక్ష కోట్లు పెట్టి కడితే కట్టుడు కూలుడు అయ్యింది..
  • కాళేశ్వరం  కాదు.. కూలేశ్వరం
  • రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
  • అప్పులు, వడ్డీల భారం మేము మోస్తున్నాం
  • ఆర్థిక పరిస్థితి మీ కళ్లముందు ఉంది
  • జీతాలు ఓ రోజు అటో ఇటో అయితే అర్థం చేసుకోండి
  • ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే

ప్రభుత్వం దగ్గర ఉంటే వాటిని ప్రజలకే ఇస్తామని.. దాచుకోవటానికి ఏమీ లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీ ముందే ఉంచుతున్నాను.. మీరు ఏం చెబితే అలా చేద్దాం అంటూ ప్రజలనుద్దేశించి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.