నామినేటెడ్​ పోస్టుల భర్తీకి గ్రీన్​ సిగ్నల్

నామినేటెడ్​ పోస్టుల భర్తీకి గ్రీన్​ సిగ్నల్
  • సీఎంతో మంత్రులు  దామోదర, సురేఖ భేటీ

మెదక్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దసరా పండగలోపే నామినేటెడ్​ పోస్టులు భర్తీ కానున్నాయి. సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్​చార్జి, దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్​లో సీఎంతో భేటీ అయి నామినేటెడ్​ పోస్టుల భర్తీ గురించి చర్చించారు.

వివిధ సమీకరణల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఖాళీగా ఉన్న వివిధ నామినేటెడ్​ పోస్టుల్లో ఎవరిని నియమించాలనే విషయమై గంటకు పైగా చర్చించగా సీఎం ఆమోదం తెలిపారు.  సుదీర్ఘ చర్చ అనంతరం ముఖ్యమంత్రి నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చారు. దసరా లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేయనున్నట్లు సీఎం తెలిపారని సురేఖ పేర్కొన్నారు.