
హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన శనివారం చెన్నైలో జరగనున్న ఆల్పార్టీ మీటింగ్ లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం సాయంత్రం వేర్వేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. చెన్నై ఎయిర్పోర్టులో వీరికి ఘన స్వాగతం లభించింది. చెన్నై గిండీలోని ఐటీసీ చోళ హోటల్లో శనివారం ఉదయం 10. 30 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. అనంతరం నేతలంతా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి దక్షిణాదికి అన్యాయం చేయాలని మోదీ సర్కార్ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు మండిపడ్తున్నాయి. ఈ అంశంపై ఆల్పార్టీ మీటింగ్లో విస్తృతంగా చర్చించనున్నారు. బీఆర్ఎస్ కూడా ఈ సమావేశంలో పాల్గొననుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు మాజీ మంత్రులు శుక్రవారం సాయంత్రం చెన్నైకి వెళ్లారు.