జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి...

జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి...

ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జరిగే జగన్నాధ రథయాత్ర ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.ఎన్టీఆర్ స్టేడియం నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు సాగే రథయాత్రను ఆదివారం ( జూలై 7, 2024 ) నాడు ప్రారంభించారు రేవంత్ రెడ్డి. జగన్నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. రథయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

జగన్నాధ రథయాత్రను నిర్వహించటంలో భాగస్వామ్యం కావడం ప్రభుత్వ బాధ్యత అని. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు కూడా మంచి అనుభూతిని కలిగిస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.