
- సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించిన ఆలయ కమిటీ
కీసర, వెలుగు: ఈ నెల 24 నుంచి ఆరు రోజుల పాటు కొనసాగే కీసరగుట్ట శ్రీభవానీ రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరుకావాలని పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్నియోజకవర్గ కాంగ్రెస్ఇన్చార్జ్తోటకూర వజ్రేష్యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం సిటీలోని నివాసంలో సీఎంను కలిసి ఇన్విటేషన్అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, ఈఓ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత కందాడి అంజి రెడ్డి, ఆలయ నిర్వాహకులు తటాకం రమేశ్శర్మ, ఉమాపతి శర్మ, వెంకటేశ్ శర్మ, సాయిలు, ముత్యాలు, నల్ల మధుసూదన్ రెడ్డి ఉన్నారు.