యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్

రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్  భవనానికి   సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎంతో పాటు  మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్  శాంతికుమారి,  ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ సర్కార్ అక్టోబర్ 21న సాయంత్రం   యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.  రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. తెలంగాణలోని పోలీసు, అగ్నిమాపక, ఎక్సైజ్, SPF, జైళ్లలో అమరవీరులు.. ఇతర యూనిఫాం సర్వీస్ విభాగాల పిల్లలకు  ఈ స్కూల్ లో  విద్య అందించనుంది . అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో  ఏర్పాటు చేయనుంది.

వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి 

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామని అక్టోబర్ 19న సీఎం రేవంత్ చెప్పిన సంగతి తెలిసిందే. వచ్చే అకాడమిక్ ఇయర్లో పోలీస్ పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఉండనుందని, ఫస్ట్ విడతగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ ప్రారంభిస్తామని చెప్పారు. పోలీసులు చేసేది ఉద్యోగం కాదని భావోద్వేగం అని అన్నారు. రాష్ట్ర సాధనలో పోలీసులకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు.

ALSO READ | గుడ్ న్యూస్: మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్