మంత్రివర్గ విస్తరణ వాయిదా.. సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

మంత్రివర్గ విస్తరణ వాయిదా.. సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి... సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. కేబినెట్ విస్తరణపై రేపు మరోసారి AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు సీఎం.  కేబినెట్ లో ఎవరికి అవకాశం కల్పించాలన్నదానిపై చర్చించనున్నారు.  దీంతో  కేబినెట్ విస్తరణకు మరి కొంత టైం పట్టే చాన్సుంది.  సీఎం రేవంత్ రెడ్డితో రాజ్యసభ ఎంపీ కేకేశవరావు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.   అలాగే  తన ఎంపీ పదవికి కూడా కేశవరావు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన కూతురు, GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ లో చేరారు.