
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దామోదర రాజనర్సింహ, జుపల్లి కృష్ణారావుతో కలిసి హెలికాప్టర్లో పోలేపల్లికి చేరుకున్నారు.
వాళ్లకు ఆలయం వద్ద దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి, ప్రత్యేక పూజల అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం నారాయణపేటకు బయలుదేరి వెళ్లారు.