డీఎస్ మృతికి ప్రముఖుల సంతాపం

డీఎస్ మృతికి ప్రముఖుల సంతాపం

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీతక్క, గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఆయేన చేసిన సేవలు మరువలేనివన్నారు.డీఎస్ లేని లోటు తీర్చలేనిదన్నారు. కాంగ్రెస్ లో డీఎస్ ప్రత్యేక ముద్ర వేశారన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 
డీఎస్ అకాల మరణంపై మంత్రి పొన్నం ప్రభాకర్  తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం పార్టీలో ఆయనతో  ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. డిఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థించారు.

డీఎస్ మృతిపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సంతాపం తెలిపారు. డీఎస్ కాంగ్రెస్ కు చేసిన సేవలు మరువలేనివన్నారు.  ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.